తిరుమల భక్తులకు శుభవార్త! శ్రీవారి దర్శనానికి దారి సుగమం.. 32 స్పెషల్ రైళ్లు సిద్ధం!
Tue Apr 08, 2025 10:40 Devotional
శేషాచల కొండలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల తిరుపతి ఆలయానికి వెళుతుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వివిధ మార్గాల్లో తిరుమలకు చేరుకుని శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటారు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు! సీబీఐ చేతిలో ఆధారాలు.. ఎఫెక్టివ్ చార్జిషీట్కి ముహూర్తం ఫిక్స్!
పూర్తి వివరాల్లోకి వెళితే.. వేసవి సెలవులు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెళ్లే తిరుమల తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మే 23వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ వారానికి రెండు సార్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.. చర్లపల్లి నుంచి 07017 శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుపతి నుంచి 07018 శని, సోమవారాల్లో నడుస్తుంది. ఇది మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్నగర్, జడ్చర్ల, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. చర్లపల్లి నుంచి ఉదయం 9: 35 గంటలకు బయలుదేరుతుంది ఈ స్పెషల్ ట్రైన్. తిరుపతి నుంచి సాయంత్రం 4: 40 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!
వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #TirumalaDarshan #TirupatiSpecialTrains #SouthCentralRailway #LordVenkateswara #TirupatiPilgrimage #DevoteesSpecial #IndianRailways
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.